Andhrapradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ ఎగిరి గంతేసే వార్త

Andhrapradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ ఎగిరి గంతేసే వార్త


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి కీలక విజయాలను సాధించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అందింది. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియజేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ మరియు విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. అయితే, ప్రస్తుత పర్యటనలో విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిస్థాయి ఆమోదం కేంద్రం నుంచి లభించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాను చదివిన పాఠశాలలో ఇప్పుడు ఐఏఎస్‌గా తిరిగి అడుగుపెట్టిన మకరంద్

Jabardasth Mahidhar: నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు

ఎట్టకేలకు రవితేజ కూడా వస్తున్నాడు.. ఎప్పుడంటే ??

Gold Price Today: ఏ మాత్రం తరగని బంగారం వెండి, ధరలు.. ఈ రోజు ఎంతంటే

Hyderabad: హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *