Headlines

తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే లక్ష్మీ కటాక్షం ఖాయం.!

తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే లక్ష్మీ కటాక్షం ఖాయం.!


భారతదేశంలోని అత్యంత పవిత్ర పుణ్య క్షేత్రాల్లో తిరుమల ఒకటి. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన ఈ దివ్యక్షేత్రం కేవలం భక్తికి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక రహస్యాలకు కూడా ప్రసిద్ధి. వాటిలో ముఖ్యమైనవి శంఖనిధి, పద్మనిధి. పురాణాల ప్రకారం, ఇవి కుబేరునికి చెందిన నవనిధులలో రెండు. శంఖనిధి, పద్మనిధులు శ్రీహరికి అత్యంత సమీపంలో ఉండే దివ్య నిధులు. తిరుమలలో స్వామివారి సన్నిధి మార్గంలో ఇవి అదృశ్యరూపంలో స్థితిచేసి ఉంటాయని భక్తుల విశ్వాసం.

శంఖనిధి – ధనప్రవాహానికి, వాణిజ్యాభివృద్ధికి సూచిక

పద్మనిధి – స్థిరాస్థి, భూసంపద, కుటుంబ సౌఖ్యానికి కారకుడు

దర్శనం వల్ల కలిగే ఫలితాలు

భక్తుల అనుభవాల ప్రకారం.. శంఖనిధి – పద్మనిధులను శుద్ధ మనస్సుతో దర్శించిన వారికి ధనధాన్యాల లోటు తొలగిపోతుంది. ఆస్తిపాస్తుల అభివృద్ధి జరుగుతుంది. అప్పులు క్రమంగా తీరుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబంలో శాంతి, ఐక్యత పెరుగుతుంది. ఇవి కేవలం భౌతిక లాభాలే కాదు.. మనస్సుకు ధైర్యం, భక్తికి బలం, జీవితానికి దిశ లభిస్తాయి.

దర్శనం ఎలా చేయాలి?

శంఖనిధి – పద్మనిధి దర్శనం అనేది కంటితో చూడడమే కాదు. “ఓం నమో వేంకటేశాయ” అని మనస్ఫూర్తిగా జపిస్తూ.. స్వామివారి దర్శనానికి వెళ్తున్న సమయంలో
లోపల ఉన్న అహంకారాన్ని, భయాన్ని వదిలి సంపూర్ణ శరణాగతితో అడుగులు వేయడమే నిజమైన దర్శనం. అప్పుడు నిధుల అనుగ్రహం స్వయంగా జీవితం మీద ప్రసరిస్తుంది.

ఆధ్యాత్మిక సందేశం

శంఖనిధి – పద్మనిధులు మనకు చెప్పే సందేశం ఒక్కటే..
ధనం లక్ష్యం కాదు, ధర్మంతో కూడిన జీవనం లక్ష్యం.
ధర్మబద్ధంగా జీవించే వారికి ఐశ్వర్యం స్వయంగా వస్తుంది. తిరుమలలో స్వామివారి సన్నిధిలోకి అడుగుపెట్టిన ప్రతి భక్తుడి జీవితంలో.. కనిపించని చేతి సహాయం ఎప్పటికైనా అనుభవమే. అది ఆ శ్రీనివాసుడిదేనని భక్తులందరికీ తెలిసిన విషయమే.

ఎవరీ శంఖనిధి, పద్మనిధి?

శంఖనిధి, పద్మనిధి కుబేరుని అష్టనిధుల్లో ప్రధానమైన నిధి దేవతలు. వీరు ధన, ఐశ్వర్యానికి అధిపతులు. తిరుమల శ్రీవారి ఆలయంలో, స్వామివారి సంపదను, అపార నిధులను రక్షిస్తూ.. ప్రధాన ద్వారం వద్ద వారి కాపలగా ఉంటారని నమ్మకం.

శ్రీవారి ఆలయంలో వారి స్థానం ఎక్కడ?

తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారానికి ఇరుపక్కల, ద్వారపాలకుల స్థానంలో సుమారు రెండడుగుల ఎత్తులో పంచలోహ విగ్రహాలు ఉంచబడ్డాయి. ఆలయం లోకి ప్రవేశించే ముందు మనం కాళ్లను శుద్ధి చేసుకునే ప్రదేశం వద్ద, శ్రీవారి ఆలయం గడపలో వీరు కనిపిస్తారు. మనకు తరచుగా శ్రీవారి దివ్యదర్శనం ఆతృత ఉంటుంది. మరికొన్ని క్షణాల్లో స్వామివారిని దర్శించబోతున్నాం అనే ఆనందంలో, వీరిని గమనించకుండా పోవడం సహజం. అయితే, తిరుమలలోని అపార నిధుల రక్షణకు ఈ దేవతలే ప్రధాన కారణమని విశ్వాసం ఉంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *