Headlines

గ్రూప్-2 విజేతగా నిలిచిన అంధ యువకుడు

గ్రూప్-2 విజేతగా నిలిచిన అంధ యువకుడు


లక్ష్యం పట్ల పట్టుదల ఉంటే శారీరక వైకల్యం అడ్డంకి కాదని నిరూపించాడు కృష్ణా జిల్లాకు చెందిన నందం నాగరాజు. రోడ్డు ప్రమాదంలో కంటిచూపు కోల్పోయినా, ఆత్మవిశ్వాసంతో పోరాడి గ్రూప్-2 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టును సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. చల్లపల్లి మండలం శివరామదుర్గాపురం గ్రామానికి చెందిన నాగరాజు, 2010లో జరిగిన ఒక బైక్ ప్రమాదంలో కంటిచూపును కోల్పోయాడు. అప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న నాగరాజు, ఐదేళ్ల పాటు ఇంటికే పరిమితమయ్యాడు. అయితే, చదువుపై మక్కువతో 2015లో ఒంగోలులోని అంధుల పాఠశాలలో చేరి, అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడలేదు. పదవ తరగతి నుంచి ఎంఏ వరకు ప్రతి స్థాయిలోనూ 70 శాతానికి పైగా మార్కులతో అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఇంటర్మీడియట్‌లో గోల్డ్ మెడల్ సాధించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. నాగరాజు ప్రయాణం పూల బాట కాదు. 2018లో తండ్రి మోహనరావు విద్యుత్ ప్రమాదంలో మరణించగా, తల్లి వెంకటేశ్వరమ్మ పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించింది. తమ్ముడు చదువు మానేసి బేకరీలో పనికి వెళ్తూ అన్న చదువుకు తోడ్పడ్డాడు. స్క్రైబ్ సహాయంతో గ్రూప్-2 పరీక్ష రాసిన నాగరాజు, ఇప్పుడు హెచ్‌ఓడీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. గెజిటెడ్ ఆఫీసర్ కావడమే తన అంతిమ లక్ష్యం అని చెబుతున్న నాగరాజు విజయం, ఎంతోమంది నిరుద్యోగ యువతకు స్ఫూర్తినిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మవారి ఆలయం కూల్చివేత.. అటవీశాఖ తీరుపై జనం ఆగ్రహం

అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని

నర్సింగ్‌ స్టూడెంట్‌ సూసైడ్‌.. అసలు కారణం ఇదే

ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు

టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు తీసుకున్నముద్దాడ రవిచంద్ర



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *