Andhra Pradesh: ప్రాకార నిర్మాణ పనులు జరుగుతుండగా అద్భుతం.. పోటెత్తిన భక్తులు.. !

Andhra Pradesh: ప్రాకార నిర్మాణ పనులు జరుగుతుండగా అద్భుతం.. పోటెత్తిన భక్తులు.. !


పరమేశ్వరుడు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నిస్తే.. శివుడు సృష్టి సర్వంలోఉన్నారని సమాధానం వినిపిస్తుంది. హిమాలయాలు, నదులు, కొండలు, అరణ్యాలు అన్నింటిలోనూ ఆయన శక్తీ అంతర్లీనంగా కనిపిస్తుంటుందని భక్తుల నమ్మకం. భక్తితో పూజించే వారి మదిలో నిత్యం కొలువుతీరి ఉంటారని చెబుతారు. పంచారామాలు, జ్యోతిర్లింగాలు చాలా ప్రసిద్దమనవి. కాశీ క్షేత్రంలో శివుడు విశ్వనాధునిగా కొలవబడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు రూపాల్లో పూజలు అందుకున్నారు ఆ పరమేశ్వరుడు.

అయితే ఆ కైలాస నాధుడికి భువిలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అలాంటి అతి పురాతన ఆలయాల్లో ఏలూరు జిల్లా కలిదిండిలో ఉన్న శ్రీపాతాళ భోగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ తాజాగా ఆలయ ప్రాకార పనులు జరుగుతున్నాయి. వేంగిరాజు రాజరాజచోళుడు పాలనా కాలంలో ఆలయం నిర్మించినట్లు స్థల పురాణం. ఈ ప్రాంతానికి చెందిన రైతు తన పొలంలో దున్నుతుండగా నాగలికి శివలింగం తగిలింది. దీంతో నెత్తురు వరదలై పారిందనేది పూరణ కధనం. రాజరాజ చోళుడి కుమారుడు రాజరాజ నరేంద్రుని కాలంలో ఈ ఘటన జరిగిందని చెబుతారు.

కలిదిండికి మూడు మైళ్ళ దూరంలో శివలింగం బయట పడటం, నాగలికర్రుకు తగిలి లింగం విరిగిపోయింది. విరిగిపోయిన శివలింగాన్ని తిరిగి అతికించారు. ఇలా అతికించిన బాగాన్ని భక్తులు గర్భగుడిలో ఇప్పటికి పూజలు చేస్తూ.. చూసి తరిస్తారు. ఇక ఈ ఆలయంలో మరో విశేషముంది. ఇక్కడి కోనేరులోకి వెళ్లి హర హర అంటే బుడ బుడ అనే శబ్దంతో నీరు ఉబికి వస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆలయంలో
ప్రాకార పనులు జరుగుతున్నాయి.

తాజాగా ఆలయ పునః నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా, మరో పురాతన శివలింగం బయట పడింది. ఇది అతి ప్రాచీనమైన పురాతన శివలింగంగా భావిస్తున్నారు. పరమ శివుడి ప్రతిమ బయటపడిందని ఊరూ వాడ ప్రచారం జరిగింది. దీంతో బయటపడ్డ రాతి శివలింగాన్ని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. కొద్దీ రోజుల్లో శివరాత్రి మహోత్సవాలు జరుగుతుండగా విశేషంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పురాతన లింగానికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు పులకించిపోతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆధ్మాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *