Rinku Singh Facebook Hack: భారత జట్టు ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ యూఎస్ఏతో జరగనుంది. ఇప్పటికే పూర్తి సన్నద్ధమైన భారత జట్టు ఆటగాడు రింకు సింగ్ టీ20 ప్రపంచ కప్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ సమయంలో రింకు సింగ్ కు ఓ షాక్ న్యూస్ తగిలింది. సిక్సర్ సింగ్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయిందంట. ఈమేరకు రింకు సింగ్ సోదరుడు సోనమ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. అలీఘఢ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపాడు.
రింకు సింగ్ ఫేస్బుక్ హ్యాక్ చేసిన కేటుగాళ్లు, మోనిటైజేషన్ తో వచ్చే ఆదాయాన్ని తమ ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారి రింకు సోదరుడు తెలిపారు.