అమెరికా నుంచి మరో గుడ్‌న్యూస్.. గ్లోబల్ హబ్‌గా భారత్.. చైనా గుత్తాధిపత్యానికి చెక్..!

అమెరికా నుంచి మరో గుడ్‌న్యూస్.. గ్లోబల్ హబ్‌గా భారత్.. చైనా గుత్తాధిపత్యానికి చెక్..!


అమెరికా నుంచి మరో గుడ్‌న్యూస్.. గ్లోబల్ హబ్‌గా భారత్.. చైనా గుత్తాధిపత్యానికి చెక్..!

ఇప్పటి వరకు ప్రపంచ శక్తి చమురు ద్వారా మాత్రమే నిర్ణయించేవారు. అయితే మారుతున్న కాలానుగుణం అధునిక సంతరించుకుంది. దీంతో ఇకపై కీలకమైన ఖనిజాల ద్వారా ప్రపంచ శక్తిని నిర్ణయిస్తారు. ఈ దిశలో ఒక పెద్ద మార్పు ఉద్భవించింది. భారతదేశంతో సహా 54 దేశాలతో కలిసి యునైటెడ్ స్టేట్స్ ఒక కొత్త అంతర్జాతీయ ఖనిజ సమూహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. అరుదైన ఖనిజాలు, ముఖ్యమైన ఖనిజాల భద్రత, సరఫరాపై చైనా పట్టును విచ్ఛిన్నం చేయడమే దీని లక్ష్యం. ప్రస్తుతం ఈ రంగంలో దాదాపు 90 శాతం చైనా ఆధిపత్యం చెలాయిస్తుంది.

వాషింగ్టన్‌లో జరిగిన 2026 క్రిటికల్ మినరల్స్ మినిస్టీరియల్ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ హాజరయ్యారు. ఈ కొత్త ఖనిజ కూటమిలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారతదేశం వైపు ఉండటం స్పష్టం చేసింది.

ఇందు కోసం రెండు ప్రధాన వేదికలు సృష్టించారు. మొదటిది FORGE, ఇది మునుపటి ఖనిజ భద్రతా భాగస్వామ్యాన్ని భర్తీ చేస్తుంది. దీని లక్ష్యం ఖనిజాల ధర, సరఫరాను భద్రపరచడంతోపాటు స్థిరీకరించడం. ప్రస్తుతం, దక్షిణ కొరియాకు ఈ బాధ్యత అప్పగించారు. రెండవ వేదిక పాక్స్ సిలికా, ఇది సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైటెక్ పరిశ్రమలకు అవసరమైన ఖనిజాల సరఫరాను చైనా నుండి విశ్వసనీయ దేశాలకు మార్చడానికి పనిచేస్తుంది. ఇందులో భారతదేశం బలమైన మూల స్తంభంగా భావిస్తున్నారు.

భారతదేశానికి ఉన్న గొప్ప అవకాశం ఏమిటి?

ఇది భారతదేశానికి ఒక ప్రధాన అవకాశం. భారతదేశం ఇకపై ఖనిజాల కొనుగోలుదారుగా మాత్రమే ఉండదు. కానీ వాటిని శుద్ధి చేయడానికి, ప్రాసెస్ చేయడానికి ప్రపంచ కేంద్రంగా మారుతుంది. చైనా కంటే భారతదేశం వంటి విశ్వసనీయ భాగస్వాములలో ఖనిజ తవ్వకాలు, శుద్ధిలో సుమారు 30 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెడతామని అమెరికా స్పష్టంగా పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *