టాలీవుడ్లో మిడ్ రేంజ్ హీరోలు తమ సినిమాల మధ్య అగ్రతారలకు దీటుగా సుదీర్ఘ విరామాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. క్వాలిటీ ముఖ్యం అంటూ ఈ హీరోలు ఒక్కో సినిమాకు రెండేళ్లకు పైగా సమయం వెచ్చిస్తున్నారు. అడివి శేష్ తన గూఢచారి 2, డెకాయిట్ సినిమాల కోసం 2026 వరకు గ్యాప్ తీసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ 2023 జూలైలో బ్రో తర్వాత సంబరాల ఏటిగట్టు కోసం రెండున్నరేళ్లకు పైగా విరామం ఇస్తున్నారు. నవీన్ పొలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకుని అనగనగా ఒక రాజు చిత్రంతో వచ్చారు. నిఖిల్ 2023లో స్పై తర్వాత 2026లో స్వయంభూతో రానున్నారు. తేజ సజ్జా కూడా ప్రతి సినిమాకు కనీసం రెండేళ్ల గ్యాప్ను కొనసాగిస్తున్నారు. ఈ సుదీర్ఘ విరామాల కారణంగా దుల్కర్ సల్మాన్, కార్తీ, ధనుష్ వంటి ఇతర భాషల హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :