బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బిగ్ షాక్. పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఒకేసారి రూ.7 వేల మేర గోల్డ్ ధర ఒకేరోజు పెరిగింది. మొన్నటివరకు ధరలు భారీగా పతనమవ్వగా.. ఇప్పుడు తగ్గుదలకు బ్రేక్ పడింది. అమెరికా-భారత్ ట్రేడ్ డీల్, కేంద్రం బడ్జెట్ ప్రకటనతో గోల్డ్, సిల్వర్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
బుధవారం బంగారం ధరలు భారీగా పెరిపోయాయి. హైదరాబాద్లో గోల్డ్ రేటు ఇవాళ రూ.6,600 పెరిగింది. ప్రస్తుతం నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,60,530కి చేరుకుంది. నిన్న రూ.1,53,930గా ఉంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.6050 పెరిగింది. ప్రస్తుతం వీటి రేటు రూ.1,47, 150కి చేరుకోగా.. నిన్న రూ.1,41,100 వద్ద స్ధిరపడింది.
ఇక చెన్నైలో గోల్డ్ రేటు బుధవారం రూ.6890 మేర పెరిగింది. మంగళవారం ఇక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,55,670 వద్ద స్ధిరపడగా.. ఇవాళ రూ.1,62,560 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే దీనిపై రూ.6300 పెరిగింది
ఇక బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,60,530 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.1,53,930గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.6600 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు చూస్తే బెంగళూరులో రూ.1,47,150 పలుకుతోంది. నిన్న ఇది రూ.1,41,100గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.6 వేల మేర పెరిగింది.
ఇక వెండి ఒకేసారి రూ.40 వేలు పెరిగింది. బుధవారం బెంగళూరులో కేజీ వెండి రూ.3.20 లక్షలు పలుకుతోంది. ఇక హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.3.20 లక్షలుగా ఉంది. నిన్న ఈ ధర రూ.3 లక్షలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ హైదరాబాద్లో వెండి ధర రూ.20 వేలు పెరిగింది.




