సాగు రంగానికి నిర్మలమ్మ సాయం ఎంత ??

సాగు రంగానికి నిర్మలమ్మ సాయం ఎంత ??


కేంద్రంలో తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌ రైతులకు తీపి కబురు చెప్పారు. సంప్రదాయ వ్యవసాయానికి బదులు విలువైన పంటలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగా చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రాధాన్యమిచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అధిక దిగుబడి ఇచ్చే పంటలతో పాటు అధిక విలువైన పంటల దిశగా రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం.. కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్ల నాటడానికి ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు. జీడిపప్పు, కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు, గంధం చెట్ల వనాలు, బాదం, పైన్‌నట్స్‌ కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 500 రిజర్వాయర్లలో చేపల పెంపకానికి తోడ్పాటు అందిస్తామన్నారు. పశు సంవర్ధక శాఖలో భారీ ప్రోత్సాహకాలు, అధిక విలువ పంటలకు ప్రోత్సాహం, తీర ప్రాంతాల్లో కొబ్బరి, చందనం చెట్లు నాటడానికి ప్రోత్సాహం ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కేంద్ర బడ్జెట్‌ వేళ.. ఈసారి నిర్మలమ్మ శారీ ప్రత్యేకత ఇదే

కుక్క కోసం రూ. 15 లక్షలు.. ఖర్చు చేసారు.. చివరికి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *