గంటల తరబడి నిద్రించడం వల్ల గుండె జబ్బుల బారిన పడటంతోపాటు, మరణించే అవకాశాలు పెరుగుతున్నాయని ఒక్లహామా యూనివర్సిటీ నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. రాత్రుళ్లు ఆరు గంటలు, అంత కంటే ఎక్కువ సేపు నిద్రిస్తూ.. పగటి పూట కూడా గంటల తరబడి గుర్రుపెట్టి నిద్ర పోయే వారికి గుండె జబ్బుల ముప్పు పెరుగుతోందని ఈ పరిశోధన నిర్ధారించింది. అదే రాత్రి పూట ఆరు గంటల కంటే తక్కువ నిద్రించే వారు పగలు నిద్రపోయినా.. ఈ రిస్కేమీ కనిపించలేదట. అదే సమయంలో.. కనీసం 6 గంటలైనా నిద్రకు నోచుకోని వారికి అకాల మరణం ముప్పు సాధారణ వ్యక్తుల కంటే.. అనేక రెట్లు ఎక్కువని పరిశోధకులు తేల్చారు. కనుక.. రాత్రి సరిపడా నిద్రపోయిన వారు పగటి నిద్ర మానుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుందని పరిశోధకులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మిన మహిళ.. అర్థరాత్రి ఊహించని ఘటన
కోహినూర్ ధరిస్తే అరిష్టమా ?? అసలు చరిత్ర ఇదే
Sania Mirza: అతనితో రొమాన్స్ కి రెడీ అంటున్న సానియా మీర్జా
రీల్స్ పిచ్చి తో హత్యలు కూడా చేస్తున్నారా ?? చివరికి తోడబుట్టిన అక్కని కూడా!
పుణ్యానికి పోతే.. పాపం ఎదురైంది.. కట్ చేస్తే జైలు పాలయ్యాడు