
పరిస్థితిని చక్కదిద్దేందుకు జట్టు హెడ్ కోచ్ తాహిర్ జమాన్ పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డ్ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గంటల తరబడి రోడ్డుపైనే వేచి చూసిన తర్వాత హోటల్ యాజమాన్యంతో మాట్లాడటంతో వారు కొన్ని గదులను కేటాయించారు. దీంతో ఒకే గదిలో ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు సర్దుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి, జట్టు వసతి కోసం పీఎస్బీ ఇప్పటికే 49,000 డాలర్ల నిధులను విడుదల చేసినట్లు సమాచారం. అయినప్పటికీ బిల్లు చెల్లించకపోవడం ఫెడరేషన్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ గందరగోళం జరిగిన మరుసటి రోజే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో పాక్ జట్టు 2-3 తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్లలోనూ పాకిస్థాన్ ఓడిపోయింది.
మరిన్ని వీడియోల కోసం :
రామ్ చరణ్, ఉపాసన కవలల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!
బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!
బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!
సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..
హాస్టల్లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?