
గాజా సివిల్ డిఫెన్స్ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 2,800 మంది పాలస్తీనీయులు ఈ బాంబు దాడుల వల్ల ఆవిరైపోయారనీ వీటిని అమెరికా సరఫరా చేసిన బాంబులుగా గుర్తించారు. సామాన్య పౌరులపై ఇలాంటి ఆయుధాలను వాడటం మానవతా చట్టాల ఉల్లంఘనే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2023 అక్టోబర్ నుంచి దాదాపు ఏడాది పాటు గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. దాంతో 72 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2025లో ఇజ్రాయెల్ పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. వైద్యచికిత్సల కోసం ఈజిప్ట్కు వెళ్లి వచ్చేందుకు గాజా ప్రజలకు అనుమతి ఇచ్చింది ఇజ్రాయెల్. ఒప్పందంలో భాగంగా ఇటీవల రఫా బార్డర్ను తెరిచింది.
మరిన్ని వీడియోల కోసం :