యాపిల్ పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కానీ ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. రోజుకు 20-40 గ్రా ఫైబర్ తీసుకుంటే సరిపోతుంది. యాపిల్ పండ్లలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచుతాయి. అందుకే ఎక్కవగా యాపిల్స్ తింటే డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్లోని కార్బోహైడ్రేట్స్ శక్తిని ఇవ్వడంతో పాటు బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు యాపిల్ పండ్లు ఎక్కువగా తినకపోవడమే మంచిది.
యాపిల్ పండ్లలో మాలిక్ యాసిడ్ ఉంటుంది. దీని ఆమ్ల స్వభావం వల్ల దంతాలపై ఎనామిల్ పొర దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే దంత సమస్యలు ఉన్నవారు యాపిల్స్ ఎక్కువగా తినకూడదు. యాపిల్ పండ్లు జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు తినకపోవడమే మంచిది. వీటిలోని అధిక షుగర్ వల్ల తొందరగా జీర్ణం కాదు. దీంతో అజీర్ణం సమస్య ఏర్పడుతుంది. యాపిల్ పండ్లలో నేచురల్ షుగర్స్, కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. అందుకే ఈ పండ్లు ఎక్కువగా తింటే గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
యాపిల్ పండ్లు తినడం వల్ల కొంతమందికి నీరసంగా ఉంటుంది. తిన్న యాపిల్ సరిగా జీర్ణం కాకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అటువంటి సమస్య ఉంటే యాపిల్ పండ్లు తినకపోవడమే మంచిది. భారతదేశంలో పెస్టిసైడ్స్ నిల్వలు ఎక్కువగా ఉండే పండ్లలో యాపిల్ ఒకటి. యాపిల్ పండ్లలో ఎక్కువగా డైఫినైల్అమైన్ అనే కెమికల్ ఉంటుంది. దాంతో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. అందుకే రోజుకు ఒకటి లేదా రెండు యాపిల్స్ తినటం ఆరోగ్యానికి మంచిదని, మేలు చేస్తుందని చెబుతున్నారు. వీటి కంటే ఎక్కువగా తింటే పైన చెప్పిన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..