లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం రద్దు.. సభా కార్యక్రమాలు రేపటికి వాయిదా..!

లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం రద్దు.. సభా కార్యక్రమాలు రేపటికి వాయిదా..!


పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నాయి. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే రాసిన పుస్తకంపై వివాదం చెలరేగింది. చైనా చొరబాట్లను ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కూడా సభలోకి ఒక పుస్తకాన్ని తీసుకువచ్చారు. వివాదానికి మరింత అజ్యం పోసినట్లు అయ్యింది. వీటన్నిటి మధ్య, సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం రద్దు చేశారు. రోజంతా జరిగిన గందరగోళం నేపథ్యంలో, సభ రేపటికి వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ప్రకటించారు.

అంతకుముందు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని మోదీని కలిశారు. లోక్‌సభలో ప్రధాని ప్రసంగానికి ముందు ఈ సమావేశం జరిగింది. అమిత్ షా కూడా స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం నిర్వహించారు. నిషికాంత్ దూబే సైతం స్పీకర్ తో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *