రౌడీ షీటర్‌ అవ్వాలని హత్య..! రిమాండ్‌కు ముగ్గురు నిందితులు..!

రౌడీ షీటర్‌ అవ్వాలని హత్య..! రిమాండ్‌కు ముగ్గురు నిందితులు..!


తమ ప్రాంతంలో రౌడీ షీటర్‌గా పెత్తనం చెలాయిస్తున్న రౌడీని హతమార్చి ఆ స్థానాన్ని తాము సొంతం చేసుకోవాలని ముగ్గురు కలిసి హత్యకు పాల్పడిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసిన కూకట్‌పల్లి పోలీసులు రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ వివరాలు వెల్లడించారు. బోరబండలో పేరు మోసిన రౌడీ షీటర్ కొడుకు సయ్యద్ షాహిద్ (26) సైతం ఆ ప్రాంతంలో తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ రౌడీ షీటర్‌గా కొనసాగుతున్నాడు. షాహిద్ ను అడ్డు తొలగించి ఆ స్థానంలో తాము నిలవాలని అతని స్నేహితులు ఎండి సాజిద్ (24), ఎండి సమీర్ ఖాన్ (25), వై.హనాక్ (25) అలియాస్ మున్నా లు పన్నాగం పన్నారు.

పథకం ప్రకారం గత నెల 29వ తేదీన పవన్ అనే స్నేహితుడి జన్మదిన వేడుకలకు కూకట్‌పల్లి ప్రకాష్ నగర్ లోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో హాజరైన షాహిద్, సాజిద్, మున్నాలు మద్యం సేవించాక.. మత్తులోకి వెళ్లిన షాహిద్ పై సాజిద్, మున్నాలు ముందుగా బీర్ బాటిల్ తో మెడ పై పొడిచి, తరువాత బండ తలతో బాది హత్య చేశారు. ఆ తర్వాత సంఘటన స్థలం నుండి పరారయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని హత్యకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండుకి తరలించినట్లు డీసీపీ తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *