కొరటగెరెలోని కోలాల గ్రామంలో రోడ్డు పక్కన ప్లాస్టిక్ సంచుల్లో నింపి ఉంచిన ఒక మహిళ తల, ముక్కలు ముక్కలుగా ముక్కలు చేయబడిన మృతదేహం కనిపించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 7న మొదట్లో ఆ మహిళ శరీర భాగాలు నింపిన ఏడు కవర్లను అటుగా వెళుతున్నవారు తమ దృష్టికి తీసుకువచ్చారు. తరువాత కొరటగెరె పోలీసులు నేరస్థలాన్ని జల్లెడ పట్టగా ఆగస్టు 8న శరీర భాగాలు, తలతో నింపిన మరో ఏడు ప్లాస్టిక్ సంచులను కనుగొన్నారు. దర్యాప్తు బృందంలో భాగమైన ఒక అధికారి మాట్లాడుతూ.. తల సహాయంతో ఆ మహిళ గుర్తింపును కనుగొన్నట్లు చెప్పారు.
కానీ ఇంకా గుర్తింపును నిర్ధారించలేదు అని పేర్కొన్నారు. శుక్రవారం తుమకూరు పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కెవి, మృతదేహ భాగాలు దొరికిన కొరటగెరె సమీపంలోని కోలాలా గ్రామంతో పాటు పొరుగు గ్రామాలను జల్లెడ పట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ సంచుల్లో నింపిన మృతదేహాన్ని పారవేసేందుకు హంతకులు కారులో వచ్చి ఉంటారని పోలీసు అధికారి తెలిపారు. చింపుగన్హళ్లి, వెంకటపుర గ్రామాలను కలిపే రహదారి వెంట అవి చెల్లాచెదురుగా ఉన్నాయని వారు అనుమానిస్తున్నారు. ఆ మహిళను వేరే చోట హత్య చేసి ఉండొచ్చని అని ఆయన అన్నారు. శనివారం ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్నందున మరిన్ని శరీర భాగాల కోసం వెతకడం కష్టమైంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి