చిత్ర పరిశ్రమలో దర్శకులుగా కెరీర్ ప్రారంభించిన అనేక మంది ఇప్పుడు నటులుగా కూడా తమదైన ముద్ర వేసుకుంటున్నారు. కెమెరా వెనుక వందల మందిని సమర్థవంతంగా నడిపించే వీరు, కెమెరా ముందు నటనలోనూ తమ సత్తా చాటుతున్నారు. దీన్ని రెండు పడవల ప్రయాణంగా అభివర్ణిస్తున్నారు.ఈ కోవలో ముందుగా చెప్పుకోవాల్సింది లోకేష్ కనగరాజ్ గురించి. దర్శకుడిగా ఇప్పటికే తనదైన శైలిని ప్రదర్శించిన లోకేష్, ఇప్పుడు నటుడిగా బిజీ కావాలని చూస్తున్నారు. శృతి హాసన్తో కలిసి ఓ ప్రైవేట్ పాటలో నటించిన లోకేష్, ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న డీసీ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది.మరోవైపు, తరుణ్ భాస్కర్ కూడా దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. ఇటీవల ఓం శాంతి శాంతి శాంతి సినిమాలో నటించిన తరుణ్, త్వరలో ఈ నగరానికి ఏమైంది 2తో దర్శకుడిగా తిరిగి వస్తున్నారు. ఈ లోపే గాయపడ్డ సింహం అనే చిత్రంలో హీరోగానూ నటిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :