Headlines

రూ. 20 లంచం కేసులో 30 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తేలిన కానిస్టేబుల్.. మరుసటి రోజే మృతి..!

రూ. 20 లంచం కేసులో 30 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తేలిన కానిస్టేబుల్.. మరుసటి రోజే మృతి..!


గుజరాత్ రాష్ట్రంలో ఒక విషాదకరమైన, దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్ లో ఒక పోలీసు కానిస్టేబుల్ కేవలం రూ. 20 లంచం కేసులో నిర్దోషిగా విడుదలైన మరుసటి రోజే మరణించాడు. ఆ కానిస్టేబుల్ దాదాపు 30 సంవత్సరాలుగా లంచం కేసును ఎదుర్కొంటున్నాడు. చివరికి అతను నిర్దోషిగా విడుదలైన మరుసటి రోజే మృ‌త్యవు అతనిని కబళించింది.

ఫిబ్రవరి 4న, 2026 గుజరాత్ హైకోర్టు అహ్మదాబాద్‌లోని వేజల్‌పూర్‌కు చెందిన కానిస్టేబుల్ బాబూభాయ్ ప్రజాపతిని అవినీతి నిరోధక చట్టం కింద అవినీతి ఆరోపణల నుండి నిర్దోషిగా విడుదల చేసింది. ఈ నిర్ణయం చివరకు అతనికి దశాబ్దాలుగా అంటుకున్న కళంకాన్ని తొలగించింది. నిర్దోషిగా విడుదలైన తర్వాత, అతను తన న్యాయవాది వద్దకు వెళ్లి అతనికి కృతజ్ఞతలు తెలిపాడు. తీర్పు తర్వాత, ప్రజాపతి తన న్యాయవాది కార్యాలయానికి వెళ్ళారని, అక్కడ ఆయన భావోద్వేగానికి గురై చివరకు నిర్దోషిగా విడుదల కావడం పట్ల ఉపశమనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

“నా జీవితంపై ఉన్న కళంకం తొలగిపోయింది, ఇప్పుడు నాకు మోక్షం కావాలి” అని కానిస్టేబుల్ అన్నారని న్యాయవాది నితిన్ గాంధీ తెలిపారు. కేసు కారణంగా నిలిపివేసిన ప్రభుత్వ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని న్యాయవాది అతనికి సలహా ఇచ్చాడు. ఈ సంభాషణ న్యాయవాది కార్యాలయంలో ఏర్పాటు చేసిన CCTV కెమెరాలలో రికార్డ్ అయినట్లు సమాచారం. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ప్రజాపతి మరుసటి రోజు సహజ కారణాలతో మరణించాడు. న్యాయం కోసం అతని సుదీర్ఘ పోరాటానికి విషాదకరమైన ముగింపు లభించింది.

1996లో ప్రజాపతి రూ. 20 లంచం తీసుకున్నారని ఆరోపించారు. 1997లో అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. 2002లో అభియోగాలు మోపబడ్డాయి. విచారణ 2003లో ప్రారంభమైంది. 2004లో సెషన్స్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి, అతనికి నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తోపాటు రూ. 3,000 జరిమానా విధించింది. ప్రజాపతి హైకోర్టులో శిక్షను సవాలు చేశాడు. 30 సంవత్సరాల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *