షాద్నగర్ పరువు హత్య కేసులో పక్కా ప్లాన్ ప్రకారమే రోహిత్.. తన అక్కను హత్య చేసినట్టు తెలుస్తోంది. అక్కను చంపే ముందు అతడు చేసిన రీల్స్ కూడా పై అనుమానాలకి బలం చేకూర్చుతున్నాయి. ఈ కేసులో.. అక్క రుచిత వేరే వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుందని ఆగ్రహించిన ఆమె తమ్ముడు రోహిత్.. రుచిత గొంతుకు చార్జింగ్ వైర్ బిగించి హత్య చేశాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్లు స్పృహ తప్పి పడిపోయిందని బంధువులకు ఫోన్ చేశాడు. విషయం తెలుసుకుని తండ్రి నిలదీయడంతో తానే హత్య చేసినట్టు రోహిత్ ఒప్పుకున్నాడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. ‘ఫేమస్ అవ్వాలి మామా, బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు… కనీసం బాగా చంపైనా ఫేమస్ అవ్వాలి’ అంటూ అతడు చేసిన రీల్స్ను బట్టి.. కావాలనే అతడు ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ వ్యవహారంపై ఇంట్లో తరచూ గొడవలు జరిగినట్లు తమకు సమాచారం ఉందన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుణ్యానికి పోతే.. పాపం ఎదురైంది.. కట్ చేస్తే జైలు పాలయ్యాడు
ఆఫీస్ లో మీటింగ్ అయ్యింది.. కట్ చేస్తే బిల్డింగ్ పైనుంచి దూకేసిన టెకీ
కంటి చూపుతోనే పేమెంట్స్..! UPI కొత్త ఫీచర్..