తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో రాఖీలు తయారు చేసే ఏకైక కేంద్రం పెద్దపల్లి. 2014 లో పెద్దపల్లిలో ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రాన్ని ఇల్లందుల కృష్ణమూర్తి ఏర్పాటు చేశారు. అనేక డిజైన్లలో తయారీ చేసి విక్రయిస్తున్నారు. ఇక్కడ నుంచి 25 రాష్ట్రాలకు రాఖీలు సరఫరా చేస్తున్నారు. అలాగే చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశా, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతోపాటు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలతో పాటు ఎనిమిది దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. లండన్లోని ఎస్.మార్ట్లో ఎస్ఆర్ఆర్ రాఖీలను విక్రయిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి పెద్దపల్లికి రాఖీల కోసం వ్యాపారులు వస్తున్నారంటేనే ఇక్కడ రాఖీలు ఎంత ప్రసిద్ధో ఊహించుకోవచ్చు.