అది విలువైన వెండి అని భావించిన కార్మికులు, స్థానికులు ఒక్కసారిగా ఆ బురదలో వెతుకులాట ప్రారంభించారు. చూస్తుండగానే వందలాది మంది అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది.అదృష్టం వరిస్తుందేమోనన్న ఆశతో జనం తొక్కిసలాటను సైతం లెక్కచేయకుండా బురదలో దిగారు. కొందరైతే బట్టలు విప్పి మరీ ఆ మెరిసే రాళ్ల కోసం గంటల తరబడి గాలించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే, ఆ మెరిసే వస్తువు నిజంగా వెండేనా.. లేక మరేదైనా ఖనిజమా అన్నది తెలియరాలేదు. పెద్ద ఎత్తున జనం గుమిగూడటంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు పరిస్థితిని అదుపు చేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. అలుపెరగని ఈ ‘వెండి’ వేట చివరకు ఎటు దారితీస్తుందో చూడాలి.