బరువు తగ్గాలని అల్పాహారం మానేస్తున్నారా? అయితే మీరు రోగాలను కొనితెచ్చుకుంటున్నట్టే

బరువు తగ్గాలని అల్పాహారం మానేస్తున్నారా? అయితే మీరు రోగాలను కొనితెచ్చుకుంటున్నట్టే


బరువు తగ్గాలని అల్పాహారం మానేస్తున్నారా? అయితే మీరు రోగాలను కొనితెచ్చుకుంటున్నట్టే

ఇందులో మనం చేస్తున్న ఒక చిన్న పొరపాటు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ మానేసి రాత్రి ఆలస్యంగా తినే అలవాటు ఉంటే జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు నిపుణులు. నేటి కాలంలో ఫిట్‌నెస్ పట్ల అవగాహన పెరిగింది. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే నిర్ణీత సమయం మాత్రమే ఆహారం తీసుకుంటూ, మిగిలిన గంటలన్నీ ఉపవాసం ఉండే పద్ధతి ప్రాచుర్యం పొందింది. సాధారణంగా 16 గంటల ఉపవాసం, 8 గంటల భోజన సమయం పాటిస్తుంటారు. అయితే, ఈ క్రమంలో ఏ సమయంలో తింటున్నామనేది అత్యంత కీలకం. ఈ విషయంలో ప్రజలు చేస్తున్న పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం..

జీవ గడియారం..

మన శరీరానికి ఒక అంతర్గత గడియారం ఉంటుంది. పగలు పని చేయడానికి, రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి మన అవయవాలు అలవాటు పడి ఉంటాయి. పగటిపూట ఇన్సులిన్ పనితీరు చాలా చురుగ్గా ఉంటుంది. రాత్రి అయ్యేకొద్దీ అది తగ్గుతుంది. శరీరం తనను తాను మరమ్మత్తు చేసుకునే సమయంలో మనం ఆహారం తీసుకుంటే, అది జీర్ణం కావడం కష్టమవుతుంది అంటున్నారు నిపుణులు. అంటే, మనం పగలు తినే ఆహారం శక్తిగా మారుతుంది, కానీ రాత్రి ఆలస్యంగా తినే ఆహారం కొవ్వుగా పేరుకుపోతుంది.

చాలామంది ఉదయం అల్పాహారం మానేసి, రాత్రిపూట భారీ భోజనం చేస్తున్నారు. ఇది మన శరీర జీవక్రియలకు వ్యతిరేకంగా పోరాడటమే అంటున్నారు నిపుణులు. ఉదయం 8 లేదా 10 గంటలకే ఆహారం తీసుకోవడం ప్రారంభించే ‘ఎర్లీ టైమ్ రిస్ట్రిక్టెడ్ ఈటింగ్’ పద్ధతి అత్యంత ప్రభావవంతమైనదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. చీకటి పడగానే మన మెదడులో ‘మెలటోనిన్’ అనే హార్మోన్ విడుదలవుతుంది.

ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించమని ప్యాంక్రియాస్‌కు సూచిస్తుంది. ఒకవేళ మీరు రాత్రి 9 గంటలకు భోజనం చేస్తే, ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాక రక్తంలో చక్కెర స్థాయిలు అలాగే ఉండిపోతాయి. దీనివల్ల భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు బ్రేక్‌ఫాస్ట్ మానేయడం కంటే రాత్రి భోజనాన్ని మానేయడం లేదా చాలా త్వరగా ముగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. సాయంత్రం 4 లేదా 6 గంటలకే భోజనం ముగించడం వల్ల, నిద్రపోయే సమయంలో శరీరం కణాల శుద్ధీకరణ ప్రక్రియను చేపడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

గోల్డెన్ రూల్..

“ఉదయం రాజులా, మధ్యాహ్నం యువరాజులా, రాత్రిపూట పేదవాడిలా తినాలి” అనే సూత్రాన్ని పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. గడియారాన్ని చూడటం ఆపి, సూర్యుడి గమనాన్ని అనుసరించి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కేవలం ఎన్ని గంటలు ఆకలితో ఉన్నామనేది కాదు, ఎప్పుడు తింటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరూ సరైన సమయంలో ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *