2026 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం, వెండిపై దిగుమతి సుంకాల్ని ఏమాత్రం తగ్గించలేదు. ప్రస్తుతం అది 6 శాతంగానే కొనసాగుతుంది. దీంట్లో 5 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కాగా ఒక శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ AIDC. ఇక వెండి దిగుమతులపైనా భారతీయ నివాసితులకు 6 శాతం దిగుమతి సుంకం ఉండగా.. మిగతా వారికి 36 శాతం వర్తిస్తుంది. గతంలో బంగారం, వెండిపై దిగుమతి సుంకాల్ని 15 శాతం నుంచి 6 శాతానికి కేంద్రం తగ్గించినా.. ఈసారి బడ్జెట్లో మాత్రం అలాంటిదేమీ చేయలేదు. కనుకు బంగారం, వెండి ధరల పతనం వెనక కేవలం అంతర్జాతీయ పరిణామాలే ఉన్నాయని అర్థంచేసుకోవాల్సి ఉంది. ఇతర పన్నుల విషయానికి వస్తే.. బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు భారత ప్రభుత్వం నుంచి GST వర్తిస్తుంది. ప్రస్తుతం బంగారు ఆభరణాలు, 24 క్యారెట్ల బంగారం, గోల్డ్ కాయిన్స్, బార్స్ అన్నింటిపైనా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఇక్కడ ఫైనల్ బిల్లుపై ఇది కట్టాల్సి ఉంటుంది. ఇంకా ఆభరణాల్లో మాత్రం.. మేకింగ్ ఛార్జీలపై 5 శాతం జీఎస్టీ ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం :