కావాల్సిన పదార్థాలు : అర కిలో చికెన్, పుట్టగొడుగులు గ్రాములు, చిన్న ఉల్లిపాయ, టమోటాలు, ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్,
పచ్చిమిర్చి , అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీస్పూన్, గరం మసాలా, రుచికి ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ నూనె టేబుల్ స్పూన్లు, కొత్తిమీర.
ముందుగా పుట్టగొడుగులను తీసుకుని వాటిని బాగా శుభ్ర పరచుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వాటిని ఉప్పుతో ఇంకోసారి శుభ్రపరచండి. అలాగే, చికెన్ను నీటితో కడిగి పక్కన పెట్టుకోండి.
స్టవ్ వెలిగించి పాన్లో ఆయిల్ వేసి ఆ తర్వాత పుట్టగొడుగులను వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి. వాటిని పక్కన పెట్టి చికెన్ ముక్కలను తీసుకుని పసుపు, ఉప్పు వేసి బాగా వేయించాలి.
ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.ఇప్పుడు టమోటా ముక్కలు తీసుకుని ఉప్పు, కారం, అన్ని రకాల మసాలా పొడులు వేసి బాగా ఉడికించాలి.
చివర్లో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్, మష్రూమ్ ముక్కలను దీనిలో వేసి కలపాలి. గ్రేవీ కావాలనుకునేవారు కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడికించండి. అలా 10 నిముషాలు అలా ఉంచి దించేయండి. అంతే వేడి వేడి చికెన్, పుట్టగొడుగులు కూర రెడీ.




