దేశంలోని తొలి హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. సైనిక విమానంలో వచ్చిన ప్రారంభించిన ప్రధాని

దేశంలోని తొలి హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. సైనిక విమానంలో వచ్చిన ప్రారంభించిన ప్రధాని


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఫిబ్రవరి 14) అస్సాం పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిబ్రుగఢ్‌లోని దేశంలోని మొట్టమొదటి హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF) ని ప్రధాని మోదీ ప్రారంభించారు. వైమానిక దళ సైనిక రవాణా విమానం (C-130J సూపర్ హెర్క్యులస్)ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఎగువ అస్సాంలోని ఒక హైవే స్ట్రిప్‌లో నిర్మించిన ఈ సౌకర్యం, అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్‌లకు ప్రత్యామ్నాయ ల్యాండింగ్ సైట్‌గా రక్షణ శాఖ ఉపయోగించనుంది.

ఈ అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం ఈశాన్య భారతదేశం రక్షణ, వ్యూహాత్మక సంసిద్ధతలో ఒక ముఖ్యమైన దశగా పరిగణిస్తున్నారు. అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం అనేది సాధారణంగా వాహనాలకు సేవలందించే హైవే స్ట్రిప్. కానీ అవసరమైతే విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కోసం రన్‌వేగా మార్చవచ్చు. దిబ్రూఘర్ ELF ఎగువ అస్సాంలో ఉంది. ఇది భారతదేశం-చైనా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది. చైనాతో ఉన్న LAC కేవలం 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలోనే మోరన్‌లో అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం (ELF)ను, రూ. 5,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. చాబువా ఎయిర్‌ఫీల్డ్‌లో ప్రధానికి అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వాగతం పలికారు.

దిబ్రూఘర్ జిల్లాలోని మోరన్ బైపాస్‌లో ఉన్న ELF వద్దకు భారత వైమానిక దళం C-130 విమానంలో ప్రధాని మోదీ చేరుకున్నారు. ఆయన విమానం తొలిసారిగా హైవేపై దిగింది. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన వైమానిక ప్రదర్శనను ప్రధాని మోదీ వీక్షించారు. ఈ సమయంలో సిబ్బంది ఫైటర్ జెట్‌లు, రవాణా విమానాలు, హెలికాప్టర్‌లతో సహా వివిధ విన్యాసాలు చేశారు. 30 MKI, C-130J సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, డోర్నియర్ నిఘా విమానం , అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH) జెట్‌లు హైవే స్ట్రిప్‌లో విజయవంతంగా ల్యాండ్ అయ్యాయి, టేకాఫ్ అయ్యాయి. హెలికాప్టర్‌లను ఉపయోగించి ప్రమాదాల తరలింపు విన్యాసాలు కూడా జరిగాయి. ఈ సౌకర్యం పోరాటంలో అలాగే మానవతా సహాయ కార్యకలాపాలలో ఉపయోగపడుతుంది.

2021లో ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ఇలాంటి స్ట్రిప్‌లో తన విమానాన్ని ల్యాండ్ చేయడం గమనించదగ్గ విషయం. ఇది సైనిక సామర్థ్యాలకు కూడా నిదర్శనం. దేశవ్యాప్తంగా 28-29 ELFలను నిర్మించడానికి వైమానిక దళం ఒక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పటికే 15 పూర్తయ్యాయని రక్షణ శాఖ తెలిపింది. ప్రధాని మోదీ ల్యాండ్ అయిన అస్సాంలో అత్యవసర ల్యాండింగ్ సౌకర్యానికి సమీపంలోని ఎయిర్‌బేస్ ఝబువా, ఇక్కడ సుఖోయ్ విమానాలు మోహరించాయి.

ఈశాన్య ప్రాంతం చైనా, మయన్మార్, బంగ్లాదేశ్‌లతో భారతదేశ సున్నితమైన సరిహద్దులకు ఆనుకొని ఉంది. ఈ ప్రాజెక్టులు శత్రు దాడుల నుండి రక్షణ కల్పిస్తాయి. భారత సైన్యానికి వేగవంతమైన ప్రతిస్పందని, మెరుగైన లాజిస్టిక్‌లను అందించడంతో పాటు, ఇవి సాధారణ ప్రజలకు కనెక్టివిటీని కూడా మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *