తక్కువ ధరలో సూపర్‌ ఫీచర్‌లతో స్మార్ట్‌ఫోన్‌ కావాలా? అయితే కొత్తగా లాంచ్‌ అయిన ఈ ఫోన్‌పై ఓ లుక్కేయండి!

తక్కువ ధరలో సూపర్‌ ఫీచర్‌లతో స్మార్ట్‌ఫోన్‌ కావాలా? అయితే కొత్తగా లాంచ్‌ అయిన ఈ ఫోన్‌పై ఓ లుక్కేయండి!


స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix భారత మార్కెట్లో తన కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోట్ ఎడ్జ్ 5Gని రిలీజ్‌ చేసింది. ప్రీమియం డిజైన్, మెరుగైన డిస్‌ప్లే, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునే యూజర్లను టార్గెట్‌గా చేసుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా తాజా Android 16 ఆధారంగా రూపొందించిన కొత్త XOS 16 ఇంటర్‌ఫేస్‌ను కూడా ఈ డివైస్‌తో పరిచయం చేసింది. నోట్ ఎడ్జ్ 5Gలో 6.78-అంగుళాల 3D-కర్వ్డ్ 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. గరిష్టంగా 4,500 నిట్‌ల ప్రకాశం అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అల్ట్రా-స్లిమ్ బెజెల్‌లు ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

ఈ ఫోన్ 6nm ప్రక్రియపై రూపొందించిన MediaTek Dimensity 7100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్, రోజువారీ వినియోగంలో సమతుల్య పనితీరును అందించేలా ఇది రూపొందించబడింది. ఫోన్ ప్రారంభ ధర రూ.19,999 (లాంచ్ ఆఫర్లతో సహా). రూ.20,000 లోపు విభాగంలో ఇప్పటికే తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, డిస్‌ప్లే, బ్యాటరీ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ ప్రత్యేకతను చూపించేందుకు ప్రయత్నిస్తోంది.

6,500mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 2,000కిపైగా ఛార్జ్ సైకిల్స్ తర్వాత కూడా బ్యాటరీ 80 శాతం సామర్థ్యాన్ని నిలుపుకుంటుందని కంపెనీ పేర్కొంది. అదనంగా మూడు OS అప్‌గ్రేడ్‌లు, ఐదు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్‌లకు హామీ ఇస్తోంది. స్క్రీన్ ప్రొటక్షన్‌ కోసం Gorilla Glass 7i ఉపయోగించారు. యాక్టివ్ హాలో లైటింగ్, వన్-ట్యాప్ AI బటన్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 50MP AI రియర్ కెమెరా లైవ్ ఫోటోలకు మద్దతు ఇస్తుంది. ఆడియో కోసం JBL ట్యూన్ చేసిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు హై-రెస్ ఆడియో, 360-డిగ్రీల సౌండ్ అనుభవాన్ని అందిస్తాయి. మొత్తం మీద బడ్జెట్‌లో ప్రీమియం అనుభవం కోరుకునే వారికి నోట్ ఎడ్జ్ 5G ఒక మంచి ఎంపిక కావొచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *