సాధారణంగా డయబెటీస్ పేషెంట్లు పండ్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. కానీ పూర్తిగా పండ్లకి మాత్రం దూరమైతే వాటి నుంచే వచ్చే పోషకాలు కూడా దూరమవుతాయి. ఇక అందుకోసం పండ్లని తినాలి. అయితే అతిగా తినకూడదు. అన్నీ పండ్లు తినకూడదు. సీతాఫలల్లో చక్కెర స్థాయిలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే షుగర్ పేషెంట్లు ఈ పండుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
దానిమ్మ మధమేహ రోగులకు మంచి ఆహారం. అలా అని దాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకు ఒక కాయ తింటే చాలు రక్తంలో చక్కెరను ఈజీగా నియంత్రిస్తుంది. ఎక్కువగా తీసుకొంటే మాత్రం సమస్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని మీరు గమనించారు.
అలాగే అరటిపండు బరువు తగ్గడం, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అయితే అరటి పండులోనూ చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు అరటిపండును పూర్తిగా తినడకుండా సగం ముక్కని తీసుకుంటే చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
యాపిల్ పండు విషయానికి వస్తే.. మిగిలిన పండ్లన్నింటిలో కంటే కూడా ఈ యాపిల్ పండ్లలో పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి. యాపిల్ పండు కొలెస్ట్రాల్ నిలువలు తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా శుభ్రం చేస్తుంది. అయితే డయాబెటీస్ రోగులు రోజుకు ఒక యాపిల్ తింటే వారికి ఎలాంటి సమస్యలు ఉండవు. అంతకు మించి ఎక్కువ తింటే మాత్రం అనేక సమస్యలు ఎదురవుతాయి.
ఇక బొప్పాయి గుండె జబ్బుల నుంచి పూర్తిగా రక్షిస్తుంది. అలాగే షుగర్ను అదుపులో ఉంచుతుంది. ఇంకా కాన్సర్ వ్యాధి కూడా రాకుండా నిరోధిస్తుంది. అయితే బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో అతిగా తీసుకుంటే అంతే చెడు చేస్తుంది. షుగర్ పేషెంట్లు బొప్పాయి పండుని మాత్రం మితంగా తీసుకోవాలి. షుగర్ ఉన్నవారు చక్కెర స్థాయి అధికంగే ఉండే పండ్లను తీసుకోకపోవడం మంచింది.