బైక్ లేదా ద్విచక్ర వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అనేక రాష్ట్రాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన అమలు చేయబడింది. దీని ప్రకారం, హెల్మెట్ ధరించని ఏ ద్విచక్ర వాహనదారునికి పెట్రోల్ లేదా డీజిల్తో సహా ఎటువంటి ఇంధనం విక్రయించే అవకాశం ఉండదు. ద్విచక్ర వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నియమాన్ని అమలు చేసింది. కానీ, ఇక్కడ కూడా కొందరు తమ అతి తెలివిని ఉపయోగిస్తున్నారు. హెల్మెట్ లేకుండా ఇంధనం పొందడానికి కొందరు ఈ నియమాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. వాహనదారుల భద్రతకోసం ధరించాల్సిన హెల్మెట్లను ఇందనం కోసం అద్దెకు తీసుకుంటున్నారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది కాస్త వైరల్ అవుతోంది.
హెల్మెట్ లేని వారు పెట్రోల్ బంకుల్లో హెల్మెట్లు అద్దెకు తీసుకోవచ్చు:
మన ప్రజలు ఎంత తెలివి మంతులు అంటే.. వారి ప్రాణాలకు రిస్క్ అని తెలిసినా కూడా తప్పులు చేస్తూనే ఉంటారు. ఎలాంటి నియమాన్ని అయినా ఉల్లంఘించడానికి ఏదో ఒక మార్గాన్ని వెతుకుతూనే ఉంటారు. అదేవిధంగా, ప్రభుత్వం అమలు చేస్తున్న నో హెల్మెట్ నో పెట్రోల్ నియమానికి బదులుగా కొందరు టూవీలర్ వాహనదారులు హెల్మెట్లను అద్దెకు తీసుకుంటున్న సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రజల అతి తెలివిని తెలుసుకున్న ఒక తెలివైన వ్యక్తి ప్రభుత్వం అమలు చేస్తున్న నో హెల్మెట్ నో పెట్రోల్ నియమాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు. పెట్రోల్ బంకుల వద్ద హెల్మెట్లను అద్దెకు ఇస్తున్నాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని ఏరోడ్రోమ్ రోడ్లో ఉన్న భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఈ వ్యాపారం వెలుగులోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి
10 నుండి 20 రూపాయలకు అద్దెకు హెల్మెట్:
ఉద్దేశపూర్వకంగా లేదా పొరపాటున హెల్మెట్ ధరించని వారు ఇక్కడ హెల్మెట్ను అద్దెకు తీసుకుని సమీపంలోని పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ హెల్మెట్ ధర కేవలం 5 నిమిషాలకు 10 నుండి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. బైక్ రైడర్లు సులభంగా పెట్రోల్ పొందడానికి ఇది సరిపోతుంది. ఈ విధంగా, హెల్మెట్ తిరిగి పొందిన తర్వాత, ఈ హెల్మెట్ను వేరొకరికి ఇస్తారు. మొత్తంమీద ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నియమం ఇక్కడ ఒక కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టింది.
ఈ కొత్త బిజినెస్కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక యువకుడు పెట్రోల్ పంప్ పక్కన నిలబడి హెల్మెట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడికి వచ్చిన మరో యువకుడు అక్కడ నిలబడి ఉన్న వ్యక్తికి హెల్మెట్ ఇచ్చి డబ్బు తీసుకుంటున్నాడు.
ముఖ్యంగా, ఇండోర్ స్థానిక సంస్థ ఆగస్టు 1, 2025 నుండి ప్రజల భద్రత కోసం కొత్త ట్రాఫిక్ నియమాలను అమలు చేసింది. జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ ఆదేశం ప్రకారం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపే ఎవరికీ ఇంధనం సరఫరా చేయవద్దని పెట్రోల్ పంపులను ఆదేశించారు. రోడ్డు భద్రతను ప్రోత్సహించడానికి, అకాల మరణాలను నివారించడానికి ఈ నియమం ఉద్దేశించబడింది. కానీ కొంతమంది దీనిని సులభంగా డబ్బు సంపాదించే వ్యాపారంగా మార్చారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి