ఘనాలోని అటవీ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. మొత్తం 8 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మంత్రులు సహా 8 మంది మృతి చెందారు. ఘనా దేశానికి చెందిన రక్షణ శాఖ, పర్యావరణ శాఖ మంత్రులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అధికారులు ప్రమాద స్థలంలో సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. ఈ ప్రమాదం ఘనాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇద్దరు మంత్రులు మృతి చెందడంతో అక్కడి ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..