మాజీ మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దేవక నందన వాసుదేవ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది.
ఈ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది మానస వారణాసి. తొలి సినిమా ఫ్లాప్ తర్వాత ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొని అందరి దృష్టి ఆకర్షిస్తుంది.
తాజాగా తన సినిమా ప్రమోషన్లలో చాలా చీరకట్టులో చాలా సింపుల్ గా కనిపిస్తుంది మానస వారణాసి. ప్రస్తుతం ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ బ్యూటీ అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కపుల్ ఫ్రెండ్లీ మూవీలో రొమాంటిక్ సీన్స్ గురించి మాట్లాడుతూ.. కథ చెప్పినప్పుడే ఇది లవ్ స్టోరీ రెండు ముద్దు సీన్స్ ఉంటాయని చెప్పారు. మొదట్లో నేను ఆలోచించాను. కానీ మా డీవోపీ, డైరెక్టర్, హీరో సంతోష్..ఇలా టీమ్ అంతా ప్రొఫెషనల్, హానెస్ట్ గా ఉన్నారు. వాళ్ల మీద నాకు నమ్మకం కలిగింది.
చాలా కంఫర్ట్ ఇచ్చారు.. సంతోష్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఈ టీమ్ అంతా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తుంటే నటిగా నేనూ ప్రొఫెషనల్ గా ఉండాలి కదా అని నటించాను. రొమాంటిక్ సీన్స్ అయినా బ్యూటిఫుల్ గా పొయెటిక్ గా తెరకెక్కించారు. నా దృష్టిలో గ్లామర్ అంటే ఎక్స్ పోజింగ్ కాదు అంటూ చెప్పుకొచ్చింది మానస




