కొబ్బరిపచ్చడి మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని సరిగ్గా చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే రుచికరంగా ఉంటుంది. అయితే, ఇంకెందుకు లేట్.. దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: కప్పున్నర కొబ్బరి ముక్కలు, పచ్చి మిర్చి 5, ఎండు మిరపకాయలు, సరిపడినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర,
వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కరివేపాకు,4 స్పూన్లు నూనె, అర టీ స్పూన్ తాలింపు గింజలు.
తయారీ విధానం : ముందుగా స్టవ్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక కొబ్బరి ముక్కలు, మిర్చి, మిరపకాయలు, చింతపండును రంగు మారే వరకు బాగా వేయించాలి.
ఇక ఇప్పుడు ఆ తర్వాత మిశ్రమాన్ని గ్రైండ్ చేయాలి. మరి పేస్ట్ లా అయ్యేవరకు ఉంచకండి. ఇక చివర్లో రుచికి సరి పడా ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసి బాగా మిక్స్ అయ్యే వరకు కలపాలి. ఇక దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు పెట్టండి. అంతే, వేడి వేడి కొబ్బరి చట్నీ రెడీ.
కొబ్బరిపచ్చడిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. అందుకే చాలా మంది వీటిని ఇష్టంగా చేసుకుని తింటారు. ఈ విధంగా చేసుకుని తింటే లంచ్ బాక్స్ లోకి సూపర్ ఉంటుంది.




