టాలీవుడ్లో సినిమాల విడుదల తేదీల విషయంలో మరోసారి తీవ్ర గందరగోళం నెలకొంది. స్టార్ హీరోల చిత్రాలు అనుకున్న సమయానికి విడుదల అవుతాయా లేదా అన్నది ప్రేక్షకులకు స్పష్టంగా తెలియని పరిస్థితి ఉంది. ఇది అభిమానులలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన నిఖిల్ నటించిన స్వయంబు చిత్రం ఏప్రిల్ నెలకు వాయిదా పడింది. అదేవిధంగా, మార్చి చివరి వారంలో రిలీజ్ కావాల్సిన రామ్ చరణ్ పెద్ది సినిమా మే నెలాఖరుకు వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. నాని కథానాయకుడిగా తెరకెక్కిన ప్యారడైజ్ చిత్రం మార్చి చివరి నుండి మే ఒకటవ తేదీకి విడుదల కావచ్చని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
టోల్గేట్ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!
స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్ తర్వాత తగ్గే ఛాన్స్?
ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..
చిరు వ్యాపారులకు అమెజాన్ బిగ్ ఆఫర్