కెప్టెన్‌ కుర్చీలో అందాల తారలు.. కథలు చెబుతామంటున్న హీరోయిన్లు

కెప్టెన్‌ కుర్చీలో అందాల తారలు.. కథలు చెబుతామంటున్న హీరోయిన్లు


ఇప్పటివరకు కెమెరా ముందు నటనతో ప్రేక్షకులను అలరించిన నాయికలు ఇప్పుడు కథలు చెప్పేందుకు కెప్టెన్ కుర్చీలోకి వస్తున్నారు. ప్రముఖ తారలు వరలక్ష్మి శరత్ కుమార్, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్, శృతి హాసన్ వంటివారు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడానికి సన్నద్ధమవుతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటికే “సరస్వతి” అనే చిత్రాన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇది ప్రాపర్ హీరో, హీరోయిన్ సబ్జెక్ట్ కాకుండా, క్యారెక్టర్లు డ్రైవ్ చేసే కథాంశంతో వస్తుందని ఆమె తెలిపారు. అనుపమ పరమేశ్వరన్ గతంలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసి అనుభవం పొందారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనిపించుకోవాలనేది ఆమె కల. కీర్తి సురేష్ కూడా దర్శకురాలిగా మారాలని కలలు కంటున్నారు. ఆమె ప్రస్తుతం ఆసక్తికరమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు, ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా కథ రాస్తున్నానని చెబుతున్నారు. శృతి హాసన్ కూడా మెగాఫోన్ పట్టుకోవడానికి సిద్ధమవుతున్నారని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. నటన, సంగీతంతో పాటు దర్శకత్వానికి కావాల్సిన నైపుణ్యాలు శృతిలో ఉన్నాయని ఆమె సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar 2: సలార్‌ సీక్వెల్‌లో కదలిక.. అంతా శృతి వల్లనే అంటున్న డార్లింగ్‌ ఫ్యాన్స్

వైరల్‌ అవుతున్న పిక్‌.. సీతారామమ్‌ సీక్వెల్‌ సాధ్యమేనా

Toxic: కన్‌ఫర్మ్ చేసిన యష్‌.. చెర్రీ కోసమే వెయిటింగ్‌

Sai Pallavi: కల్కి సీక్వెల్‌లో పల్లవి.. పాన్ ఇండియాకే ఫిక్సయ్యారా

Allu Arjun: స్టార్ట్ కాకముందే సందడి… ఐకాన్‌స్టార్‌తో లోకేష్‌ మేజిక్‌ గ్యారంటీ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *