కూటమి ఐక్యతా రాగం.. మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు

కూటమి ఐక్యతా రాగం.. మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు


అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ప్రాధాన్యతను సంతరించికుంది. కూటమి సభ్యులంతా ఐకమత్యంతో పనిచేస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. నిబద్ధత లేకపోతే ఫలితాలు కష్టమన్నారు. 20 నెలల కూటమి పాలనలో ఎక్కడా విభేదాలు లేవన్నారు చంద్రబాబు. కూటమి సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. అసెంబ్లీ సమావేశాలను కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సీరియస్‌గా తీసుకోవాలన్నారు చంద్రబాబు. సభ్యలు ప్రసంగాలు వింటా.. మంత్రుల సమాధానమూ వింటా అన్నారు చంద్రబాబు.

వైసీపీ కుట్రలపై మూడు పార్టీలు అప్రమత్తంగా ఉండాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. వైసీపీ విధ్వంస కుట్రలపై చర్చించాలన్నారు. మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని YCP చూస్తోందన్నారు పవన్.

ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా కూటమి ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్‌గా తీసుకోవడంతో ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరారు. కూటమిలో విభేదాలకు తావు ఉండొద్దని మూడు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

లడ్డూ కల్తీ విషయంలో కూటమి నేతలంతా ఒకేమాట మీద ఉన్నారు. వైసీపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీలోనూ ఐక్యతా రాగం వినిపిస్తూ వైసీపీని టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యారు కూటమి సభ్యులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *