ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు, అయితే ఇప్పటికే కుంభ రాశిలో రాహు, బుధ, శుక్ర గ్రహాలు ఉన్నాయి. రాహువు, సూర్యుడు శత్రు గ్రహాలు. ఈ రెండు సంయోగం చెందడం అశుభ కరం, దీనిని గ్రహణ యోగం అంటారు. ఈ గ్రహణ యోగం కొన్ని రాశుల వారికి అనేక సమస్యలను తీసుకొస్తుంది. ముఖ్యంగా ప్రతి క్షణం వీరికి అవమానకర సంఘటనలే ఎదురు అవుతాయి. అందుకే ఈ సమయాన్ని పాపపు ఘడియలు అని అంటారు. అయితే ఈ సమయంలో నాలుగు రాశుల వారు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు పండితులు.