కొన్నేళ్లుగా బాలీవుడ్ను వదిలేసి.. హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు, ఇంటర్నేషనల్ ఈవెంట్ల తో గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక. త్వరలోనే ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీకి ఆమె ఏకంగా రూ. 40 కోట్ల పారితోషికం అందుకోబోందని టాక్. నిజానికి ఈ మూవీ కోసం ప్రియాంక సుమారు రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని.. సుదీర్ఘ చర్చల తర్వాత రూ.40 కోట్లకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.దీంతో.. ఇప్పుడు భారతీయ సినిమాల్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కథనాయికగా ప్రియాంక రికార్డ్ సృష్టించింది. అటు..మహేష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడంతో ప్రియాంకకు ఇంతమొత్తంలో చెల్లించేందుకు నిర్మాతలు సిద్దమయినట్టు సమాచారం. ఇప్పుడు హాలీవుడ్ లోనూ పాపులర్ అయిన ప్రియాంకను ఈ మూవీలో తీసుకోవటం ద్వారా మహేష్ సినిమాకూ ప్రపంచ స్థాయిలో హైప్ వస్తుందని.. మేకర్స్ భావించే ఇంత పెద్ద మొత్తానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :