ఉద్యోగం లేదని పిల్లని ఇవ్వనన్నారు – ఇతగాడు ఏం చేశాడో తెలిస్తే మీకు బుర్ర పాడే

ఉద్యోగం లేదని పిల్లని ఇవ్వనన్నారు – ఇతగాడు ఏం చేశాడో తెలిస్తే మీకు బుర్ర పాడే


ఉద్యోగం లేదని పిల్లని ఇవ్వనన్నారు – ఇతగాడు ఏం చేశాడో తెలిస్తే మీకు బుర్ర పాడే

ఓ అమ్మాయిని ప్రేమించాడు.. ఆమె కూడా ఓకే చెప్పింది.. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. వివాహం చేసుకోవాలంటే.. ఏదైనా ఉద్యోగం లేదా పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉండాలి.. కానీ.. అతనికి అదేం లేదు.. ఖాళీగానే ఉంటున్నాడు.. ఈ క్రమంలోనే ఈజీగా డబ్బుల సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.. దాని కోసం స్కెచ్ వేశాడు.. కట్ చేస్తే.. అమ్మాయి కోసం టీటీఈ అవతారం ఎత్తాడు.. అలా డబ్బులు సంపాదిస్తూ.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE)గా నటిస్తూ రైళ్లలో నకిలీ టిక్కెట్లను అమ్ముతూ.. ప్రయాణికులను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వారణాసి ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) అధికారులు తెలిపారు.

ఈ మోసం గురించి రైల్వే ప్రయాణికులు చేసిన అనేక ఫిర్యాదుల ఆధారంగా మధ్యప్రదేశ్‌లోని రేవాలోని అట్రైలా నివాసి ఆదర్శ్ జైస్వాల్‌ను GRP, రైల్వే పోలీస్ ఫోర్స్ అరెస్టు చేశాయి. అతని నుంచి నకిలీ తూర్పు మధ్య రైల్వే గుర్తింపు కార్డు, TTE ఆప్రాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ప్రకారం, దర్యాప్తు సమయంలో జైస్వాల్ తన స్నేహితురాలిని వివాహం చేసుకోవడానికి టిటిఇగా నటించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. నిందితుడు బి.టెక్ గ్రాడ్యుయేట్ అని.. కానీ నిరుద్యోగిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. లవర్ ను పెళ్లి చేసుకునేందుకు ఇదంతా చేశాడని తెలిపారు.

“అతను ఒక మహిళను ప్రేమించాడు.. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు.. కానీ అతని తల్లిదండ్రులు ఉద్యోగం సంపాదించే వరకు అతనికి వివాహం చేయడానికి నిరాకరించారు. అందుకే అతను అలాంటి చర్యకు పాల్పడ్డాడు” అని వారణాసి GRP ఇన్స్పెక్టర్ రాజౌల్ నగర్ అన్నారు. మార్చిలో తన గ్రామంలోని సైబర్ కేఫ్‌లో జైస్వాల్ నకిలీ ఐడి కార్డును తయారు చేశాడని, నకిలీ రైలు టిక్కెట్లను కూడా తయారు చేసి ప్రయాణీకులకు విక్రయించాడని తెలిపారు.

మోసపూరిత సంఘటనలను ఉదహరిస్తూ, జైస్వాల్ ఒకసారి వారణాసి నుండి లక్సర్ వరకు జనతా ఎక్స్‌ప్రెస్ కోసం నకిలీ టికెట్ (B-3) ను జ్యోతి కిరణ్, గుంగున్‌లకు విక్రయించాడని GRP ఇన్‌స్పెక్టర్ చెప్పారు. మరుసటి రోజు జ్యోతి స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, ఆమెకు B-3 కాకుండా M-2 కోచ్ కనిపించింది. ఆమె సోదరుడు రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేశాడు.

అదేవిధంగా, జైస్వాల్ ఒకసారి దినేష్ యాదవ్ అనే వ్యక్తి కోసం ముంబైకి ఈ-టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే, ఆ ప్రయాణీకుడు రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు.. అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అతని తేడాను గుర్తించాడని.. అనంతరం ఇద్దరూ డబ్బు విషయంలో కూడా వాదించుకున్నారని చెప్పారు.

అతను నకిలీ టిక్కెట్లు తయారు చేసి ప్రజలను తప్పుదారి పట్టించేవాడని.. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని వారణాసి GRP ఇన్స్పెక్టర్ రాజౌల్ నగర్ చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *