కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్ లో కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించి, రైల్వే వ్యవస్థను మార్చే ఈ భారీ ప్లాన్ లో హైదరాబాద్ ఒక ముఖ్య కేంద్రంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఏడు హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించింది. వీటి కోసం సుమారు 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. దాదాపు 4,000 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్టులను 2047 నాటికి భారత్ ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఒకేసారి నిర్మిస్తామని చెప్పారు. ఈ ఏడు కొత్త కారిడార్లు దేశ రవాణా రంగ రూపురేఖలను పూర్తిగా మారుస్తాయని అన్నారు. హైదరాబాద్ కు బెంగళూరు, చెన్నై, పూణే నగరాలతో నేరుగా హై-స్పీడ్ రైల్ లింకులు ఏర్పడటం వల్ల పెద్ద మార్పు వస్తుంది. రైల్వే మినిస్ట్రీ ప్రకారం, హైదరాబాద్-బెంగళూరు ప్రయాణానికి రెండు గంటలు, హైదరాబాద్-చెన్నై కి రెండు గంటల 55 నిమిషాలు, పూణే-హైదరాబాద్ ప్రయాణానికి గంటా 55 నిమిషాలు పడుతుంది.
మరిన్ని వీడియోల కోసం :