అల్లాదుర్గంలో చిరుత కలకలం.. బయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు

అల్లాదుర్గంలో చిరుత కలకలం.. బయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు


తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం బెంబేలెత్తిస్తోంది.. చిరుతలు, పులులు ఆహారం కోసం నిత్యం జనావాసాల్లోకి రావడంతో ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.. తాజాగా మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.. మండల పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద రోడ్డు పక్కన సోమవారం రాత్రి చిరుత పులి గ్రామస్థుల కంట పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే

మెదక్ జిల్లా అల్లాదుర్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. మండలంలోని ఐబీ తండా వద్ద చిరుత పులి కనిపించింది. నాందేడ్ అకోలా 161వ జాతీయ రహదారి పక్కన సోమవారం రాత్రి సమయంలో చిరుత పరుగులు తీయడాన్ని ప్రయాణికులు గుర్తించారు. చూస్తుండగానే ఆ చిరుత జాతీయ రహదారి పక్కనున్న కంచెదూకి అటువైపుగా ఉన్న ఐబి గిరిజన తాండ వైపు పంట పొలాల్లోకి పారిపోయింది. దీంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

సమాచారం తెలుసుకున్న అటవి శాఖ అధికారులు చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఐబి గిరిజన తాండ ను సందర్శించి గ్రామస్తులతో, రైతులతో చిరుత సంచరిస్తున్న విషయాన్ని వెల్లడించారు. పంట పొలాల్లోకి వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. మరోసారి చిరుత సంచరిస్తున్న విషయం తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *