అరణ్యాలు దాటి హైవేపై ప్రత్యక్షమవుతున్న పులులు, సింహాలు.. భయాందోళనలో జనం

అరణ్యాలు దాటి హైవేపై ప్రత్యక్షమవుతున్న పులులు, సింహాలు.. భయాందోళనలో జనం


మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రం శివారులో చిరుత పులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. గత రాత్రి 161వ జాతీయ రహదారిపై చిరుత కనిపించడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శనివారం రాత్రి అల్లాదుర్గం శివారులోని జాతీయ రహదారి పక్కన పొదల్లోనుంచి చిరుత పులి రోడ్డు దాటుతుండగా అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు, ఆ ప్రాంతంలో లభించిన పాదముద్రల ఆధారంగా చిరుత సంచారాన్ని అధికారికంగా ధృవీకరించారు. చిరుత సంచారం నేపథ్యంలో అల్లాదుర్గం మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు గుంపులుగా వెళ్లాలని, రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు రావద్దని సూచించారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. చిరుతను పట్టుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలు భయాందోళన చెందవద్దని అధికారులు భరోసా ఇచ్చారు. చిరుత సంచారంతో అల్లాదుర్గం పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెబ్ యూజర్లకు శుభవార్త.. ఇక బ్రౌజర్ నుండే నేరుగా వీడియో, ఆడియో కాల్స్

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే.. ఏం చేశారంటే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగుతున్నారా.. జాగ్రత్త

కష్టపడి రాళ్లతో పగలగొట్టాడు.. అంతలోనే..

రాత్రి తలుపు తట్టిన శబ్దం.. వణికిపోతున్న ఊళ్లు.. ఎందుకిలా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *