మధ్యప్రదేశ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. 11ఏళ్ల కుర్రాడు.. కన్న తండ్రి చేసిన బండారాన్ని బయటపెట్టాడు. శివపురి జిల్లాలోని పిచ్చోర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మాయాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక భర్త తన భార్యను తీవ్రంగా కొట్టి, గొడ్డలితో దారుణంగా నరికి చంపేశాడు. ఇదంతా వారి 11 ఏళ్ల కొడుకు కళ్ళ ముందే జరిగింది. అంతే కాదు, తన భార్యను గొడ్డలితో చంపిన తర్వాత, భర్త రాత్రంతా ఆమె మృతదేహం దగ్గర పడుకుని, అవకాశం దొరికిన తర్వాత ఉదయం పారిపోయాడు.
తెల్లారిన తర్వాత.. ఆ 11 ఏళ్ల కుమారుడు చుట్టుపక్కల వారికి విషయం చెప్పగా, వారు షాక్ అయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టి, నిందితుడైన భర్తను అరెస్టు చేశారు. ఈ హత్య శుక్రవారం రాత్రి (ఆగస్టు 1) జరిగింది. శివపురి జిల్లాలోని మాయాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి శివరాజ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 43 ఏళ్ల కేసర్ బాయి ఆదివాసిని ఆమె భర్త హరిరామ్ ఆదివాసి గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. అతను తన 11 ఏళ్ల కొడుకు ముందే ఈ హత్య చేశాడు. నిందితుడు హరిరామ్ రాత్రంతా తన భార్య మృతదేహం దగ్గర పడుకున్నాడు. దీన్నంతటిని చూస్తూనే ఉన్న అమాయకుడైన కొడుకు.. రాత్రంతా భయంతో వణుకుతూ కూర్చొని ఉండిపోయాడు.
హరిరామ్ రోజూ తాగి ఇంటికి వచ్చేవాడని, అతని ఇంటి నుండి ప్రతిరోజూ గొడవలు వచ్చేవని స్థానికులు చెప్పారు. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నిందితుడు హరిరామ్ తాగి ఇంటికి వచ్చాడనీ, ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ మరింత పెరిగిపోయి హరిరామ్ తన భార్యపై గొడ్డలితో దాడి చేశాడని స్థానికులు తెలిపారు. అతని 11 ఏళ్ల కుమారుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడని, భయపడిన కొడుకు ఇంట్లో నిశ్శబ్దంగా పడుకున్నాడని అన్నారు.
రాత్రి 11 గంటల నుండి హత్య జరిగినంత వరకు జరిగిన మొత్తం సంఘటన గురించి 11 ఏళ్ల కుమారుడు సమీపంలోని ఇరుగు పొరుగు వారికి చెప్పాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. మాయాపూర్ పోలీసులు హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహిళ మృతదేహానికి పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..