అన్నాచెల్లెళ్ల ఆలయం..రాఖీ రోజున మాత్రమే దర్శనం! ఎక్కడ ఉందో తెలుసా..?

అన్నాచెల్లెళ్ల ఆలయం..రాఖీ రోజున  మాత్రమే దర్శనం! ఎక్కడ ఉందో తెలుసా..?


రాఖీ పండుగ, రక్షా బంధన్ కు దానికంటూ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ అన్నదమ్ముల మధ్య ప్రేమ, అవినాభావ బంధానికి ప్రతీక. సోదరీమణులు తమ అన్నయ్య మణికట్టుపై రాఖీ కట్టి అతని దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తారు. సోదరులు తమ సోదరీమణులను రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగను నిర్వహించుకుంటాం. అయితే,ఈ రాఖీ పండుగ వేళ ఒక గొప్ప ఉత్సవం నిర్వహించే అన్నా చెల్లెలకు ప్రతీకగా ఆలయం ఉందని మీకు తెలుసా..? శతాబ్ధాల నాటి చరిత్ర కలిగిన ఆలయం ఎక్కడుంది..? దాని విశిష్టతలేంటో ఇక్కడ తెలుసుకుందాం…

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలోని చుడియా ఖేడాలోని హల్దౌర్ అడవిలో ఉంది అన్నాచెల్లెల ఆలయం. శతాబ్దాలుగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయం సోదరుడు, సోదరీమణుల మధ్య ప్రేమకు చిహ్నం. మనం నమ్మకాలను విశ్వసిస్తే, అది సత్యయుగానికి సంబంధించినదని చెబుతారు. చుడియా ఖేడా అడవిలో పూర్ణ శక్తి పీఠ ఆలయం ఉంది. ఇక్కడ అన్న, చెల్లెల్లు రాతిపై దేవతల రూపంలో కూర్చుని ఉంటారు. వీరితో పాటుగా అనేక ఇతర దేవతల విగ్రహాలు కూడా ఆలయంలో ప్రతిష్టించబడ్డాయి. స్థానిక ప్రజలు ఈ ఆలయంపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నారు.

రక్షా బంధన్ పండుగ నాడు ఈ ఆలయంలో ఒక గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గురు పూర్ణిమ నాడు విందు నిర్వహిస్తారు. ప్రతి నెల శుక్ల పక్ష సోమవారం నాడు భక్తులు ప్రసాదం అందిస్తారు. ఆలయం, స్థానిక ప్రజలతో ముడిపడి ఉన్న పురాణం ప్రకారం, ఒకనాడు దొంగలు అన్న ఎదురుగానే తన చెల్లెలితో దురుసుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఆ అన్న తన సోదరి గౌరవాన్ని కాపాడమని దేవుడిని ప్రార్థించాడు. ఆ ఇద్దరు సోదరసోదరీమణుల గౌరవాన్ని కాపాడటానికి.. దేవుడే ఇక్కడ ప్రత్యక్షమై వారిని రక్షించాడని స్థానికులు నమ్ముతున్నారు. అప్పటి నుంచి రక్షాబంధన్ వేడుకలు భాయీ​-బెహన్​ ఆలయంలో చేసుకుంటున్నారు. అన్నాచెల్లెళ్లను, అక్కాతమ్ముళ్లను రక్షించడానికి దేవుడే ఇక్కడ భూమిపైకి వచ్చాడని అక్కడి స్థానిక ప్రజల నమ్మకం.

ఇవి కూడా చదవండి

ఆ తరువాత వారిద్దరూ అక్కడే శిలగా మారారని చెబుతారు.. అప్పటి నుండి అన్నయ్య, సోదరి విగ్రహాలు ఆలయంలో రాళ్ల రూపంలో ఉన్నాయని చెబుతారు. ఈ ఆలయంలో తల వంచి నిజమైన హృదయంతో ప్రార్థించే వారికి దేవతల రూపంలో ఉన్న అన్నాచెల్లెళ్ల ఆశీస్సుల వల్ల దీర్ఘాయుష్షు, సుఖ సంతోషాలు లభిస్తుందని స్థానిక ప్రజలు చెబుతారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *