భారతదేశ కృత్రిమ మేధస్సు భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రతిష్టాత్మకమైన రోడ్మ్యాప్ను రూపొందించారు. 2047 నాటికి దేశం ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి AI సూపర్ పవర్లలో ఒకటిగా ఉండాలని ప్రకటించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సమ్మిట్ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరుగుతుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ నాయకులు పాల్గొంటున్నారు. ఇందులో AI సానుకూల, ప్రతికూల ప్రభావాలను చర్చించనున్నారు. దీంతో పాటు, అనేక స్టార్టప్లు కూడా తమ AI ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించాయి.
న్యూఢిల్లీలో జరిగిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, నేడు, AI నాగరికత మార్పు దశలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా మానవ సామర్థ్యాలను పెంచగలదు, కానీ మార్గదర్శకత్వం లేకుండా వదిలేస్తే, అది ప్రస్తుత సామాజిక పునాదులను పరీక్షించగలదు. దాని అర్థవంతమైన, సానుకూల అంశాలను చర్చించడానికి ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. భారత్ నిష్క్రియాత్మక వినియోగదారుగా ఉండదని, అత్యాధునిక నమూనాలు, ప్లాట్ఫారమ్ల ప్రపంచ సృష్టికర్తగా ఉద్భవిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. AI మానవ కేంద్రీకృతంగా, అందరినీ కలుపుకొని ఉండాలని స్పష్టం చేశారు. భారత్ AI నినాదం “సర్వజన్ హితాయ్, సర్వజన్ సుఖయే” (అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందం) తో సమన్వయం చెందుతుందని, సాంకేతికత మానవాళికి సేవ చేసేలా చూస్తుందని ఆయన అన్నారు.
“AI stands at a civilisational inflection point”: PM Modi calls for human-centric innovation pic.twitter.com/CEfFn7HXPu
— ANI (@ANI) February 17, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..